ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత! | Hi-tension during Farmers, wagers meeting at Uddandarayunipalem | Sakshi
Sakshi News home page

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత!

Sep 22 2016 7:17 PM | Updated on Oct 1 2018 2:00 PM

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత! - Sakshi

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత!

ఉద్దండరాయునిపాలెంలో రైతులు, రైతు కూలీలు తలపెట్టిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది.

అమరావతి: రాజధాని భూములకు అందుతున్న పరిహారం విషయంలో చర్చించుకునేందుకు రైతులు, రైతు కూలీలు గురువారం తలపెట్టిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్దండరాయునిపాలెంలో ఈ రోజు సాయంత్రం స్థానిక రైతులు భూ పరిహారానికి సంబధించిన అంశాలపై చర్చింకునేందుకు రైతు కూలీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 144 వ సెక్షన్ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. దీనిని రైతులు లెక్క చేయకుండా ఒక్కచోట చేరి చర్చించుకునేందుకు యత్నించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement