పెద్దపల్లిలో ఆగిన గూడ్స్‌ : రైళ్లకు అంతరాయం | Goods Train Stopped in Peddapalli over Technical Problem | Sakshi
Sakshi News home page

పెద్దపల్లిలో ఆగిన గూడ్స్‌ : రైళ్లకు అంతరాయం

Jan 16 2017 6:43 PM | Updated on Sep 5 2017 1:21 AM

పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఓదెల మండలం కొలనూరు వద్ద సోమవారం సాయంత్రం గూడ్స్‌ రైలులో సాంకేతిక లోపం తలెత్తటంతో పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ‍్లించగా, మరి కొన్నింటిని మరొక లైన్‌లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష‍్కరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement