బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య | father committed suicide in children | Sakshi
Sakshi News home page

బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య

Sep 15 2014 12:37 AM | Updated on Aug 16 2018 4:22 PM

బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య - Sakshi

బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య

కుటుంబకలహాలతో విరక్తి చెంది ఇద్దరు బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు

 సేలం: కుటుంబకలహాలతో విరక్తి చెంది ఇద్దరు బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలో కొందలం గ్రామానికి చెందిన మునియప్పన్ (35) లారీడ్రైవర్. ఇతని భార్య మహేశ్వరి (30). వీరికి నరేంద్రప్రసాద్(11), కౌసల్య (9) ఇద్దరు పిల్లలు.  దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో మహేశ్వరి శనివారం రాత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విరక్తి చెందిన మునియప్పన్ రాత్రి విషం తీసుకొచ్చి ముందుగా నరేంద్రప్రసాద్, కౌసల్యకు బలవంతంగా తాగించి, తరువాత తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పరమత్తి వేలూరు పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అక్కడ మునియప్పన్, నరేంద్రప్రసాద్, కౌసల్య శవాలుగా పడి ఉన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పిల్లలు ఇద్దరికి నయంకాని చర్మ సమస్య ఉండడం, భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా జీవితంపై విరక్తి చెంది పిల్లలకు విషమిచ్చి మునియప్పన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement