⇒ భూ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్
⇒ భూ దందాపై మూకుమ్మడిగా రైతుల అభ్యంతరాలు
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ప్రభుత్వంపై రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. మచిలీపట్నంలో పారిశ్రామిక కారిడార్, పోర్టు నిర్మాణం పేరుతో 33,601 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో మంగళవారం కోన, పోలాటితిప్ప, అరిసేపల్లి, మేకవానిపాలెం, బుద్దాలపాలెం గ్రామాల్లో రైతుల నుంచి అంగీకారపత్రాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు అవగాహన సదస్సులను మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) అధికారులు ఏర్పాటు చేశారు.
మాకు ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని కూతుళ్ల పెళ్లి చేసే సమయంలో కట్నంగా ఇచ్చామని, భూ సమీకరణ పేరుతో ఆ భూములు తీసుకుంటే వందలాది కాపురాలు కూలిపోయే ప్రమాదం ఏర్పడుతోందని పలువురు మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఐదు గ్రామాలకు చెందిన రైతులు పార్టీలకు అతీతంగా భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించి సంతకాలు చేసి ఎంఏడీఏ అధికారులకు అందజేశారు. అసైన్డ్ భూములు సమీకరణ నోటిఫికేషన్లో ఒకరి పేరున ఉండగా వేరే రైతులు ఆ భూమికి హక్కుదారులుగా ఉన్నారని ఈ తరహా రైతులను ఏం చేస్తారని రైతులు అధికారులను ప్రశ్నించారు.
గ్రామాలకు గ్రామాలను సైతం ఖాళీ చేయించే పనిలో భాగంగా భూసమీకరణ అంశాన్ని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని, ప్రాణాలు పోయినా భూములను ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. భూసమీకరణ అవగాహన సదస్సు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని భూములు గుంజుకోలేరని రైతులు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. భూసమీకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, ప్రభుత్వ భూ దందాను ఇప్పటికైనా ఆపాలని అన్ని గ్రామాల్లోని రైతులు నినాదాలు చేశారు. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం జరగటంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారు.
భూములు తీసుకుంటే.. కాపురాలు కూలుతాయి!
Published Tue, Sep 27 2016 7:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement