
ప్రేమ పేరుతో నయవంచన
ప్రేమిస్తున్నానని నమ్మించి రహస్యంగా తీసుకెళ్లాడు. ప్రియురాలిపై అత్యాచారం చేసి, నగలను తస్కరించడంతోపాటు ఆమెను స్నేహితులకు అప్పగించాడు.
- ప్రియురాలినే స్నేహితులకు అప్పగించిన మృగాడు
-కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
చెన్నై : ప్రేమిస్తున్నానని నమ్మించి రహస్యంగా తీసుకెళ్లాడు. ప్రియురాలిపై అత్యాచారం చేసి, నగలను తస్కరించడంతోపాటు ఆమెను స్నేహితులకు అప్పగించాడు. ప్రేమ పేరుతో మోసపోయి సామూహిక అత్యాచారానికి గురైన యువతిని పోలీసులు రక్షించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది.
కన్యాకుమారి జిల్లా సూళిత్తురై సమీపం పాంకోడు కాలనీకి చెందిన ప్రీజిత్ అలియాస్ సురేష్ (27). ఇతడు వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తూ కాలేజీ విద్యార్థులను కళాశాలలకు చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ప్రేమపేరుతో వల విసిరాడు. అతని మాయమాటలు నమ్మిన యువతి ఈ నెల 13వ తేదీన నగలతో అతనితో వెళ్లింది. యువతితో కలిసి పర్యాటక ప్రాంతాలు పర్యటిస్తూ సురేష్ ఆమెపై అత్యాచారం చేశాడు.
అనంతరం నాగర్కోవిల్కు తీసుకువచ్చి స్నేహితుల సహాయంతో లాడ్జీలో దిగాడు. పెళ్లి ఏర్పాట్లు అంటూ యువతి వద్దనున్న నగలతో బజారు కెళ్లి ఆమె ఉన్న గదిలోకి ముగ్గురు స్నేహితులను పంపాడు. కాగా లాడ్జీలో ఒక యువతి, కొందరు యువకులు ఘర్షణ పడుతున్నట్లు వడచ్చేరి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా యువకులు పరారు కాగా యువతిని కాపాడారు. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాన్డ్రైవర్ సురేష్, స్నేహితులు దినేష్, గోపాల్లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు జ్ఞానప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.