‘పవార్‌..మహారాష్ట్ర లాలు’ | BJP targets Pawars to get mileage in Maharashtra | Sakshi
Sakshi News home page

‘పవార్‌..మహారాష్ట్ర లాలు’

Oct 8 2013 11:47 PM | Updated on Mar 29 2019 9:18 PM

ఎన్సీపీ సీనియర్‌ నాయకుడు, ఉప-ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై బీజేపీ సీనియర్‌ నాయకుడు గోపీనాథ్‌ ముండే ఘాటైన ఆరోపణలు గుప్పించారు.

సాక్షి, ముంబై: ఎన్సీపీ సీనియర్‌ నాయకుడు, ఉప-ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై బీజేపీ సీనియర్‌ నాయకుడు గోపీనాథ్‌ ముండే ఘాటైన ఆరోపణలు గుప్పించారు. అజిత్‌ పవార్‌ను మహారాష్ట్ర లాలూప్రసాద్‌ యాదవ్‌గా ఆయన అభివర్ణించారు. ఔరంగాబాద్‌లో సోమవారం జరిగిన రైతుల సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, ఎన్సీపీపై ముండే దుమ్మెత్తిపోశారు. రైతులను ఉద్దేశించిన మాట్లాడుతూ జలవనరులశాఖలో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయాల్సిన అవసరమే లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తామే ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశిస్తామని హమీ ఇచ్చారు. గడ్డి కుంభకోణంలో లాలుకు జైలు శిక్ష పడినట్టు నీటిపారుదల కుంభకోణంలో అజిత్‌ పవార్‌కు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. అయితే పవార్‌ను యెరవాడ లేదా హర్సుల్‌ జైల్లో ఉంచాలా అనేది ప్రజలే నిర్ణయించాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement