వేలాది మందికి ఉద్యోగావకాశాలు
నేడు పరిశ్రమలకు భూమిపూజ
హాజరుకానున్న సీఎం సిద్ధరామయ్య
కోలారు: జిల్లాలో మరో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుంది. ఇప్పటికే కోలారు తాలూకాలోని నసరాపురం వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటైంది. ప్రస్తుతం కోలారు తాలూకాలోనే వేమగల్ ప్రాంతం అతి పెద్ద పారిశ్రామిక వాడ కానుంది. నియోజక వర్గ పునర్విభజన కాకముందు వేమగల్ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2014 తరువాత వేమగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోలారులో కలిపారు. ప్రస్తుతం వేమగల్ ప్రాంతం ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్ క్లెయిన్ కంపెనీకి శంకుస్థాపన చేయడంతోపాటు మరో రెండు కంపెనీలు అధికారికంగా ప్రారంభించనున్నారు. వేమగల్ పారిశ్రామిక ప్రాంతం 664.41 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కురుగల్, హార్జేనహళ్లి, పర్జేనహళ్లి, సింగహళ్లి గ్రామాల పరిధిలో పారిశ్రామిక ప్రాంతం వ్యాపించి ఉంది. ప్రభుత్వం కేఐఏడీబీ ద్వారా ఈ ప్రాంతంలోని రైతుల నుంచి పరిశ్రమల కోసం భూములను స్వాధీనం చేసుకుని పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించారు. కేఐఏడీబీ వేమగల్ పారిశ్రామిక వాడకు 2014 మే 22న పరిపాలన మరియు ఆర్థిక శాఖ ఆమోదం పొంది. 155.08 కోట్ల వ్యయంతో పారిశ్రామిక వాడను అభివృధ్ది చేయడానికి 27.23 ఎకరాల విస్తీర్ణంలో రహదారులను అభివ్రుధ్ది చేస్తున్నారు.
కే పీటీసీఎల్కు 10 ఎకరాల స్థలాన్ని రిజర్వు చేసి ఉంచారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో నాలుగు కంపెనీల స్థాపనకు అవకాశం కల్పించారు. అందులో మిత్సుబిషి ఎలెక్ట్రిక్, టాటా పవర్ కంపెనీ, జిఎస్ఏ కంపెనీలకు తలా 50 ఎకరాల స్థలాన్ని, శివం ఆటో మొబైల్ కంపెనీకి 20 ఎకరాల స్థలాన్ని పంపిణీ చేయడం జరిగింది. వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో మౌళిక సౌలభ్యాలను అందించడానికి 100.02 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు ప్రగతిలో ఉంది. విశాలమైన రహదారులు, డ్రై నేజి, కాలువలు తదితర సౌలభ్యాలను అందిస్తున్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతానికి బెంగుళూరు కాడుబీసన హళ్లి నుంచి మురికినీటిని శుధ్దీకరించి సరఫరా చేస్తున్నారు. పైప్లైన్ పనులకు ఇప్పటికే టెండర్ పిలవడం జరిగింది. మిత్సుబిషి ఎలెక్ట్రిక్ కంపెనీ లిఫ్ట్ తయారీ యూనిట్ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఔషధాలను తయారు చేసే గ్లాక్సో స్మిత్ లైన్ కంపెనీ శంకుస్థాపనను గురువారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించనున్నారు. 250 కోట్ల వ్యయంతో ఈ కంపెనీని ప్రారంభిస్తుండి సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.
స్థానికులకు ఉద్యోగావకాశాలు
వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రారంభమవుతున్న కంపెనీలలో స్థానికులకు భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు విద్యార్హతను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలని కంపెనీలకు సూచించడం జరిగింది. కరువు ప్రాంతమైన జిల్లాలో వేమగల్ పారిశ్రామిక ప్రాంతం వల్ల ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
- కలెక్టర్ డాక్టర్ త్రిలోక్చంద్ర
కోలారులో మరో పారిశ్రామికవాడ
Published Tue, Sep 8 2015 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement