పోరాడుతున్న పాక్ | Younis Khan, Misbah-ul-Haq fight for Pakistan in second Test | Sakshi
Sakshi News home page

పోరాడుతున్న పాక్

Jan 11 2014 1:22 AM | Updated on Nov 9 2018 6:43 PM

పోరాడుతున్న పాక్ - Sakshi

పోరాడుతున్న పాక్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతోంది. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది.

దుబాయ్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతోంది. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. దీంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ (62 బ్యాటింగ్), మిస్బా (53 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మన్‌జూర్ (6), షెహజాద్ (9), హఫీజ్ (1) విఫలం కావడంతో పాక్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే యూనిస్, మిస్బాలు నాలుగో వికెట్‌కు అజేయంగా 113 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ప్రదీప్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం పాక్ ఇంకా 91 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 318/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 134 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 223 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ (42), జయవర్ధనే (278 బంతుల్లో 129; 15 ఫోర్లు) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బందులు పడటంతో లంక 68 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. జునైద్ 3, రాహత్, అజ్మల్ చెరో రెండు వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement