సీసీఓబీపై వైఎంసీఏ గెలుపు | Sakshi
Sakshi News home page

సీసీఓబీపై వైఎంసీఏ గెలుపు

Published Thu, Aug 11 2016 12:04 PM

ymca wins over ccob in basket ball tourny

సాక్షి, హైదారాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో గ్రూప్ ‘ఇ’ విభాగంలో హైదరాబాద్ వైఎంసీఏ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్  సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో బుధవారం ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్టు 49-40తో సీసీఓబీ జట్టును ఓడించింది.

 

ఈ మ్యాచ్‌లో వైఎంసీఏ తరఫున లలిత్ రెడ్డి 20 పాయింట్లు, వినయ్ 10 పాయింట్లు చేయగా... సీసీఓబీ జట్టులో ఫణి 12, నాగరాజ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ 42-27తో ఎన్‌బీఏ ‘బి’ జట్టుపై గెలిచింది. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ తరఫున ప్రదీప్ సింగ్ (16), విపిన్ (15) అద్భుతంగా రాణించగా... ఎన్‌బీఏ జట్టులో శేరు (15) ప్రతిభ కనబరిచాడు.  

Advertisement
 
Advertisement