జింఖానా, న్యూస్లైన్: ఆలిండి యా ఓపెన్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వైష్ణవి పెద్ది రెడ్డి పరాజయం పాలైంది. సికింద్రాబాద్ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల సెమీఫైనల్లో వైష్ణవి 3-5తో టాప్ సీడ్ వానియా దంగ్వాల్ (ఢిల్లీ) చేతిలో ఓటమి పాలైంది.
ఇతర మ్యాచ్ల్లో రియా భాటియా (ఢిల్లీ) 7-5, 6-4తో అమృత ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచింది. పురుషుల విభాగంలో లక్షిత్ సూద్ (ఉత్తరప్రదేశ్) 6-3, 4-6, 6-0తో విజయ్ కన్నన్ (తమిళనాడు)పై, వినోద్ శ్రీధర్ (తమిళనాడు) 6-2, 6-3తో అంకిత్ సచ్దేవా (ఢిల్లీ)పై నెగ్గి ఫైనల్స్కు చేరుకున్నారు.
డబుల్స్ విభాగం సెమీఫైనల్లో కునాల్ ఆనంద్-సాగర్ మంజన జోడి 6-4, 6-4తో సాగర్ అహూజ-షాబాజ్ ఖాన్పై, విజయ్ కన్నన్- ఫరీజ్ మహ్మద్ జోడి 6-3, 0-6, 10-2తో అర్పిత్ శర్మ-లక్షిత్ సూద్ జోడిపై గెలిచారు. మహిళల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో అమృత ముఖర్జీ-లిఖిత శెట్టి జంట 6-3, 6-1తో నిత్యా రాజ బాబు-స్నేహ పడమట జంటను, అరంటా ఆండ్రెడా-అనుష్క భార్గవ జంట 6-4, 7-5తో రియా భాటియా-వానియా దంగ్వాల్ జంటను ఓడించి ఫైనల్స్లో అడుగు పెట్టాయి.
వైష్ణవి ఓటమి
Published Sat, Jan 25 2014 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement