మనీష్‌ పాండే మెరిసినా..

SRH Set Target of 161 Runs Against Rajasthan Royals - Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కవ శనివారం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 161 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మనీష్‌ పాండే(61; 36 బంతుల్లో 9 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకోవడంతో సన్‌రైజర్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ 23 పరుగుల వద్ద కెప్టెన్‌ కేన్‌విలియన్స్‌(13) వికెట్‌ను నష్టపోయింది.  ఆ తరుణంలో డేవిడ్‌ వార్నర్‌-మనీష్‌ పాండేల జోడి నిలకడగా ఆడింది.

ఈ క్రమంలోనే మనీష్‌ పాండే 27 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 75 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్‌(37)రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి మనీష్‌ పాండే కూడా ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ తడబాటుకు గురైంది. వార్నర్‌, మనీష్‌ పాండేల తర్వాత ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. చివరి ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌(17 నాటౌట్‌) ఫోర్‌, సిక్స్‌ కొట్టడంతో  సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.  విజయ్‌ శంకర్‌(8), షకిబుల్‌ హసన్‌(9), దీపక్‌ హుడా(0), సాహా(5)లు ఘోరంగా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో ఉనాద్కత్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఓషాన్‌ థామస్‌, వరుణ్‌ అరోన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top