డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ | south africa batting | Sakshi
Sakshi News home page

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

Oct 11 2015 10:59 AM | Updated on Sep 3 2017 10:47 AM

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 30 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా జట్టు రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్నతొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 30 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56 పరుగులు (69 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ 12 పరుగుల(19 బంతులు,)తో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. రైనా బౌలింగ్లో సిక్స్ కొట్టిన డు ప్లెసిస్ అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.

అంతకుముందు ఓపెనర్ హషీం ఆమ్లా 37 పరుగులు(59 బంతులు, 3 ఫోర్లు) చేసి జట్టు స్కోరు 102 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన డివిలియర్స్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ డుప్లెసిస్కు సహకారం అందిస్తున్నాడు. మూడో వికెట్కు ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో అశ్విన్, అమిత్ మిశ్రాలు చెరో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement