
'ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం'
వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను మట్టికరిపించి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు.
కరాచీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను మట్టికరిపించి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టు సాధ్యమైనతంవరకూ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని అభిమానులకు హామీ ఇచ్చాడు. మరో 23 రోజుల్లో ఆరంభం కానున్నప్రపంచకప్ కు తమ జట్టు ఇప్పటికే సిద్ధమైందని మిస్బావుల్ తెలిపాడు.
ఫిబ్రవరి 15 వ తేదీన అడిలైడ్ లో పాకిస్తాన్-టీమిండియాల మధ్య జరిగే పోరులో విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రను తిరగరాస్తామన్నాడు. ఇరుదేశాల మధ్య జరిగే ఆ పోరు ఎంతటి ప్రాముఖ్యత కల్గిందో తమకు తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటకు సిద్దమవుతున్నామన్నాడు.