రన్నరప్ నైనా | naina jaiswal stands on runner up position in Table tennis tournment | Sakshi
Sakshi News home page

రన్నరప్ నైనా

Dec 16 2013 12:13 AM | Updated on Sep 2 2017 1:39 AM

నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా జైస్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో మౌమితా దాస్ (పశ్చిమ బెంగాల్) 4-3తో నైనాపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

న్యూఢిల్లీ: నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా జైస్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో మౌమితా దాస్ (పశ్చిమ బెంగాల్) 4-3తో నైనాపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
 
  హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి దీటుగా జవాబిచ్చిన నైనా ఆఖరి గేమ్‌లో కాస్త నిరాశపర్చింది. నిర్ణయాత్మక గేమ్‌లో ఇద్దరు చాలా జాగ్రత్తగా ఆడారు. అయితే మౌమితా బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్స్‌తో అటాకింగ్ గేమ్‌ను ఆడింది. దీనికి అడ్డుకట్ట వేయడంలో నైనా విఫలమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement