ఐఎంటీ నాగ్‌పూర్ గెలుపు | Nagpur IMT won | Sakshi
Sakshi News home page

ఐఎంటీ నాగ్‌పూర్ గెలుపు

Jan 18 2014 12:17 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లో శుక్రవారం ‘స్పోర్ట్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. తొలి రోజు ఫుట్‌బాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లో శుక్రవారం ‘స్పోర్ట్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. తొలి రోజు ఫుట్‌బాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఐఎంటీ-నాగ్‌పూర్,  ఐపీఈ-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నాగ్‌పూర్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐపీఈ-హైదరాబాద్ జట్టు 78 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఐఎంటీ-నాగ్‌పూర్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది.

 ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఐఎంటీ-హైదరాబాద్ జట్టు 5-0 గోల్స్ తేడాతో మేనేజ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఈ చాంపియన్‌షిప్‌ను ఐఎంటీ-హైదరాబాద్ డెరైక్టర్ పాండురంగారావు లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బిజినెస్ స్కూల్ జట్లు పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో సుమారు 300 క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ఐఎఫ్‌ఎంఆర్ (చెన్నై), ఐఎంటీ (నాగ్‌పూర్), క్రిస్ట్ యూనివర్సిటీ, ఎన్‌ఐసీఎంఏఆర్ (పుణె)లతో పాటు హైదరాబాద్‌లోని ఎన్‌ఎంఐఎంఎస్,  ఐబీఎస్, ఐపీఈ తదితర జట్లు తలపడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement