ఉన్ముక్త్, వినయ్ లను కొన్న ముంబై ఇండియన్స్ | Mumbai Indians acquire Unmukt, Vinay Kumar for 2015 IPL season | Sakshi
Sakshi News home page

ఉన్ముక్త్, వినయ్ లను కొన్న ముంబై ఇండియన్స్

Nov 4 2014 7:05 PM | Updated on Sep 2 2017 3:51 PM

ఉన్ముక్త్, వినయ్ లను కొన్న ముంబై ఇండియన్స్

ఉన్ముక్త్, వినయ్ లను కొన్న ముంబై ఇండియన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ట్రేడింగ్ విండో' ద్వారా ఇద్దరు ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది.

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ట్రేడింగ్ విండో' ద్వారా ఇద్దరు ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్ముక్త్ చంద్, కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆర్. వినయ్ కుమార్ ను కొనుగోలు చేసింది. తమ టీమ్ నుంచి ప్రవీణ్ కుమార్, మైఖేల్ హస్సీని రిలీజ్ చేసింది. వీరిద్దరిని 2015 క్రీడాకారుల వేలంలో వేరే జట్లు కొనుక్కోవచ్చు.

2015 ఎడిషన్ కోసం మొదటి 'ట్రేడింగ్ విండో' అక్టోబర్ లో తెరిచారు. దీని గడువు డిసెంబర్ 12తో ముగుస్తుందని బీసీసీఐ తెలిపింది. తదుపరి ఎపీఎల్ ఎడిషన్ ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు జరుగుతుందని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement