ఐపీఎల్‌ : కోహ్లిసేనదే బ్యాటింగ్‌! | KKR Won The Toss And Choose To Field Against RCB | Sakshi
Sakshi News home page

Apr 8 2018 7:46 PM | Updated on Apr 8 2018 7:53 PM

KKR Won The Toss And Choose To Field Against RCB - Sakshi

టాస్‌ వేస్తున్న దినేశ్‌ కార్తీక్‌

కోల్‌కతా : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా ఇక్కడ ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కోల్‌కతా మాజీ కెప్టెన్‌ గంభీర్‌ ఈ సీజన్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో దినేశ్‌ కార్తీక్‌ సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

టాస్‌ గెలిచిన దినేశ్‌ కార్తీక్‌ ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో తొలుత ఫీల్డింగ్‌ చేసిన జట్లకే విజయం దక్కింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా సైతం టాస్‌ ఫీల్డింగ్‌ వైపే మొగ్గు చూపింది. ఇక టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కోహ్లిసేన తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. ఇక ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఉతప్పలకు ఇది 150 ఐపీఎల్‌ మ్యాచ్‌ కావడం విశేషం.

తుది జట్లు
ఆర్సీబీ : క్వింటన్‌ డికాక్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మన్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుంధర్‌, క్రిస్‌ వోక్స్‌, కుల్వంత్‌, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌

కేకేఆర్‌: క్రిస్‌లిన్‌, ఉతప్ప, నితీష్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, ఆండ్రూ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌, పియూష్‌చావ్లా, విజయ్‌ కుమార్‌, మిచెల్‌జాన్సన్‌, కుల్దీప్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement