ఆల్‌ ది బెస్ట్‌ | India women cricket team need to repeat its 2017 World Cup performance | Sakshi
Sakshi News home page

ఆల్‌ ది బెస్ట్‌

Oct 31 2018 1:55 AM | Updated on Oct 31 2018 1:55 AM

India women cricket team need to repeat its 2017 World Cup performance - Sakshi

టి20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెస్టిండీస్‌ చేరుకున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌. నవంబర్‌ 9 నుంచి 24 వరకు వెస్టిండీస్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

గ్రూప్‌ ‘బి’లో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్‌ జట్లు... గ్రూప్‌ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ జట్లున్నాయి. లీగ్‌ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్‌ 24న జరుగుతుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement