ఏఐటీఏ టాలెంట్ సీరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆదిత్య కల్లెపల్లి, మిరిక జైస్వాల్ టైటిళ్లు సాధించారు.
జింఖానా, న్యూస్లైన్: ఏఐటీఏ టాలెంట్ సీరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆదిత్య కల్లెపల్లి, మిరిక జైస్వాల్ టైటిళ్లు సాధించారు. త్రినైన ఇన్ఫార్మాటిక్స్ లిమిటెడ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-14 విభాగం ఫైనల్లో ఆదిత్య 4-6, 6-4, 6-4తో ప్రలోక్ ఇక్కుర్తిపై గెలిచి విజేతగా నిలిచాడు.
తొలి సెట్లో ఓడిన ఆదిత్య తర్వాతి సెట్లలో విజృంభించి ఆడాడు. ప్రలోక్ గ ట్టి పోటీనిచ్చాడు. బాలికల టైటిల్ పోరులో మిరిక జైస్వాల్ 6-3, 6-7 (2/7), 6-4తో ధృతి కపూర్పై చెమటోడ్చి నెగ్గింది. తొలి సెట్ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన మిరికకు రెండో సెట్లో పరాజయం ఎదురైంది. దీంతో నిర్ణాయక మూడో సెట్లో పుంజుకొని ఆడిన మిరిక సెట్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది.