చిట్టి నాయుడు ఏమైపోయాడు?

Vijay Sai Reddy Setires On Nara Lokesh Over Telangana Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరుఫున ఏపీ మంత్రి నారా లోకేష్‌ ప్రచారం చేయకపోవడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన స్పీచ్‌లతో ఓటర్లను అయోమయానికి గురిచేస్తాడని చంద్రబాబు నాయుడు గారు రాకుండా చేశారంటా.. అని ట్వీట్‌ చేశారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అంతా తానై టీడీపీని నడిపించి, డిపాజిట్లు కూడా రాకుండా మట్టికరిపించిన అపర మేధావి చిట్టి నాయుడు ఏమైపోయాడు? ప్రచారంలో దిగి తన అనర్గళ స్పీచ్‌లతో ఓటర్లను అయోమయానికి గురి చేసి.. పడే ఓట్లు కూడా పోగొడతాడేమోనని అమరావతి దాటకుండా ముగ్గేసి వచ్చాడట నాయుడు బాబు!’ అని సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top