చంద్రబాబు ఓ గజదొంగ: రోజా | MLA RK Roja Slams AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓ గజదొంగ: రోజా

Apr 1 2018 2:18 PM | Updated on Mar 23 2019 9:10 PM

MLA RK Roja Slams AP CM Chandrababu Naidu - Sakshi

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, తిరుపతి: వందల హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఓ గజదొంగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. గతంలో ప్యాకేజీల జపం చేసి నాలుగేళ్లు వృథాచేసిన చంద్రబాబు అనూహ్యంగా హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రకటించినా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆమె విమర్శించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతున్న వ్యక్తి వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా రోజా గుర్తుచేశారు. కానీ సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రయోజనాలపైగానీ, ప్రత్యేక హోదాపై గానీ చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు, పార్టీ శ్రేణులు చేపట్టబోయే దీక్షలకు ప్రజలంతా సంఘీభావం తెలపాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement