‘మెట్రో’పై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్‌ | Karne Prabhakar Slams Kishan Reddy | Sakshi
Sakshi News home page

‘మెట్రో’పై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్‌

Feb 17 2020 3:14 AM | Updated on Feb 17 2020 3:40 AM

Karne Prabhakar Slams Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెట్రో రైలు ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం అని, ఆయనకు రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణపై ప్రేమ లేదని మరోమారు నిరూపించుకున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, విప్‌ కర్నె ప్రభాకర్‌ విమ ర్శించారు. ఆదివారం ఆయన టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి వైఖరిని ఖండించారు. మెట్రో రైలుకు రూ.1,200 కోట్ల కేటాయింపు కేంద్రంతో కుదిరిన ఒప్పందం మేరకే జరిగిందని, అందులో కిషన్‌రెడ్డి మెహర్బానీ ఏమీ లేదని ప్రభాకర్‌ స్పష్టంచేశారు.  మెట్రో ప్రారంభానికి సంబంధించిన ప్రతీ ప్రకటనలోనూ ప్రధాని మోదీ ఫొటోను వేయడాన్ని గుర్తు చేస్తూ, కేంద్రం నుంచి తెలంగాణకు ఏదైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకువస్తే పౌర సన్మానం చేస్తామని ప్రభాకర్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement