బీజేపీ నుంచి పోటీచేస్తా 

Contest from BJP Heroin Reshma - Sakshi

పాల్వంచరూరల్‌ : రానున్న ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేస్తానని వర్ధమాన సినీనటి భూక్యా రేష్మారాథోడ్‌ తెలిపారు. గురువారం స్థానిక బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో శ్రీరామ్‌సెల్‌ పాయింట్‌ ప్రారంభోత్సవానికి ఆమె హాజరై మాట్లాడారు. తమ స్వగ్రామం ఇల్లెందు మండలం ఉసిరికాయలపల్లి అని తెలిపారు.

మణుగూరు ప్రాథమిక విద్యను చదివి.. కాకతీయ యూనివర్శిటీలో లా పూర్తి చేసినట్లు చెప్పారు. చదువునే రోజుల్లో కొన్ని షార్ట్‌ఫిల్మŠస్‌లో నటించానన్నారు. ఈ క్రమంలో ‘ఈ రోజుల్లో’ సినిమాకు అవకాశం వచ్చిందన్నారు. తర్వాత తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమాలో నటించినట్లు  వివరించారు. రాజకీయలపై ఉన్న ఆసక్తితో ఏప్రిల్‌ 14న బీజేపీలో చేరినట్లు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top