సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన మేనిఫెస్టోను మరో మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ ,తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు, 100 రోజుల్లో మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. వీటితోపాటే రేషన్దారులకు సన్నబియ్యం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇం దిరమ్మ బిల్లుల చెల్లింపులు వంటివి ప్రజల ముం దుంచింది. మరిన్ని కీలక అంశాలను జోడిస్తూ మేని ఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నేతృ త్వంలోని కమిటీ రూపకల్పన చేసింది. సుపరిపాలన అంశానికి తొలి ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’గీతాన్ని ప్రకటించనుంది. ప్రజా పాలనంతా సచివాలయం నుంచే జరుగుతుందని, ముఖ్యమంత్రి సహా మంత్రులంతా సచివాలయం కేంద్రంగా పనిచేస్తారని చెప్పనుంది.
ఉద్యమకారులకు ప్రాధాన్యమిచ్చేలా...
మీడియాకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేలా ప్రజాప్రభుత్వం ఉంటుందన్న అంశాలకు ప్రాధాన్య త ఇవ్వనుంది. ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గానికి ఒక అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు, 2009 తర్వాత మరణించిన ఉద్యమ కారుల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం, ఉద్యమకారులపై కేసులన్నీ మాఫీ వంటి వాటిని జతపరిచినట్లు తెలిసింది. ఎస్సీల్లో మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సంక్షేమానికి నిధులు వెచ్చించడంతో పాటు, ఎస్టీల్లో లంబాడాలకు ఒకటి, కోయ, గోండులను కలిపి ఇంకొకటి, ఇతర తెగలకు కలిపి మరొక కార్పొరేషన్ ఏర్పాటు, బీసీల్లోనే ఇదేమాదిరి కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఎల్లంపల్లి వరకూ నీటికి ప్రణాళిక: సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే, టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన ప్రాణ హితలో భాగంగా చేపట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తిచేసి ఎల్లంపల్లి వరకు నీటిని తర లించే అంశాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావించనుంది. ఈ బ్యారేజీని పూర్తి చేసి చేవెళ్ల వరకు నీటిని తరలించడం ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఆయకట్టుకు నీళ్లిస్తామని హామీ ఇవ్వనుంది. వీటితోపాటే సింగరేణిలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్య లు తీసుకోవడం, కొత్తగా అనుకూలమైన ప్రాంతాల్లో భూగర్భ మైనింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రకటన చేయ నుంది. జర్నలిస్టులకు హెల్త్స్కీమ్, ఇళ్ల స్థలాలు, లాయర్లకు రూ.200కోట్లతో భవిష్యనిధి, సీపీఎస్ రద్దు, మైనార్టీ సబ్ప్లాన్ ఏర్పాటు, సచార్, సుధీర్ కమిటీ నివేదికల అమలు వంటి అంశాలను పొందుపరిచినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
‘జయ జయహే తెలంగాణ’
Published Sun, Nov 18 2018 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement