అసహనం జ్ఞాన విచక్షణలను క్షణంలో పెడదారి పట్టించగలదని చెప్పే వృత్తాంతాలు అనేకం ఉన్నాయి. వ్యాస విరచితమైన మహాభారతంలో ధర్మరాజు, ద్రౌపది, భీముడు మధ్య జరిగిన ఒక సంవాదంలో కూడా సహనం, దాని ఫలితం, స్వభావం గురించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బలి తన తాతగారైన ప్రహ్లాదుడిని అడిగిన సంశయాన్ని ప్రస్తావించి ద్రౌపది ఈ చర్చకు తెరలేపుతుంది. ‘సహనం గొప్పదా? క్షాత్రం గొప్పదా? ఏది శ్రేయస్కరం?’ అని బలి అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు జవాబిస్తూ ‘రెండూ అతిగా ఉండరాదు.
సహనం ఎక్కువైతే నీకింద పనిచేసేవాళ్లు కూడా నీ మాట లక్ష్యపెట్టరు. ఇక అతి కోపాన్ని క్షాత్రంగా భావిస్తే సర్వనాశనం తప్పదు’ అని చెప్పాడు. ద్రౌపది ధర్మరాజుకు ఈ వృత్తాంతం చెప్పి కౌరవుల విషయంలో అతి సహనం పనికిరాదని సూచించింది. కానీ, ధర్మజుడు అంగీకరించలేదు. ‘దెబ్బతిన్నవాడు దెబ్బకొట్టినవాడిని దెబ్బతీస్తూ పోతే ఇక ఈ లోకంలో ఎవడూ మిగలడు’ అంటూ ‘సహనంతోపాటు క్షమాగుణమే జీవనశాంతినిస్తుంది. ఈ రెండూ మహనీయగుణాల’ని ద్రౌపదిని చల్లబరిచేందుకు ప్రయత్నించాడు. ద్రౌపది సహనం కోల్పోయింది. ‘నీకూ, నీ బుద్ధికీ మోహం కలిగించిన విధి, ప్రారబ్ధాలకు ఓ నమస్కారం’ అని ధర్మజుడిపై చిరాకుపడిందామె.
జ్ఞాన సముపార్జన కావాలనుకుంటూనే అందుకు చదువుకోవాలన్న విషయంలో సహనంలేని రుషిపుత్రుడి కథ మరోటి ఉంది. భరద్వాజ మహర్షి కొడుకు యువక్రీతుడు ఎలాంటి గట్టి అధ్యయనం లేకుండా వేదాలు, వాటి సారం తెలుసుకోవాలన్న ఆలోచన చేశాడు. ‘సూక్ష్మంలో మోక్షం’ అన్నట్టుగా దానికోసం యాగం చేశాడు. కృషి, సహనం, పట్టుదల లేనిదే వేదాధ్యయనం సాధ్యంకాదని యువక్రీతుడికి మారువేషంలో వచ్చిన ఇంద్రుడు హితోపదేశం చేశాడు.
తననే ఉదహరించుకుంటూ జన సౌకర్యం కోసం గంగానదిపై ఉత్త ఇసుకతో వంతెన నిర్మించే పనిచేయబోయి ఎలా భంగపడ్డాడో చెప్పాడు. గోగ్రహణంలో విజయుడై తిరిగొచ్చినది తన కొడుకు ఉత్తరుడని, బృహన్నల కాదని వాదించి, సహనం కోల్పోయి తన చేతిలోని పాచికలను కంకుభట్టుగా తన కొలువులో ఉంటున్న ధర్మరాజు మొహాన కొట్టాడు విరటుడు. ఈ ఘటన తర్వాత విరటుడు జరిగినదానికి విచారం వ్యక్తంచేశాడు. ధర్మరాజు కూడా స్థిమితపడ్డాడు. అయితే, ఈ సంగతి తెలుసుకున్న పాండవ సోదరులు మాత్రం విరటుడిని తొక్కిపడేద్దామనుకున్నారు. అటు తర్వాత సహనం కోల్పోవడం మంచిది కాదని గ్రహించి శాంతపడ్డారు.
అయితే, ఎంతో సహనంగా ఉండే ధర్మరాజు సైతం కంకుభట్టు వేషం తీసేసి విరటునికి తామెవరిమో చెప్పాక సహనం కోల్పోతాడు. తిన్నగా వెళ్లి విరటుడి సింహాసనంపైనే కూర్చున్నాడు! ఎంతటివారైనా సహనం, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అసహజమేమీ కాదని, సహనం వహించి సత్ఫలితాలు సాధించేవరకూ కృషిచేసేవారే విజ్ఞులనీ, విజేతలనీ భారతం పలుమార్లు ఉదాహరణ సహితంగా చెబుతుంది.
తల్లావ ఝ్జల శివాజి
సహనంతోనే విజ్ఞత సాధ్యం
Published Thu, Feb 20 2014 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement