ఎన్నికల కమిషనర్ల వేతనం రూ.2.50 లక్షలు | Two-fold increase in salaries of three election commissioners | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషనర్ల వేతనం రూ.2.50 లక్షలు

Feb 15 2018 2:21 AM | Updated on Aug 14 2018 4:34 PM

Two-fold increase in salaries of three election commissioners - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల వేతనాలు రెండింతలు పెరిగాయి. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సమానంగా వారు వేతనాలు అందుకోనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఎన్నికల సంఘంలో ఉన్న మిగతా ఇద్దరు కమిషనర్లూ ప్రస్తుతం ఉన్న నెలకు రూ.90 వేల బదులు రూ.2.50 లక్షలు అందుకోనున్నారు. పెరిగిన వేతనం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement