ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం | Three guerrillas killed in Pulwama district gunfight | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Mar 3 2016 9:15 AM | Updated on Sep 3 2017 6:55 PM

జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో గురువారం సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో గురువారం సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. థ్రాల్ పట్టణ సమీపంలో మిలిటెంట్లు తలదాచుకున్నట్లు సమాచారంతో భద్రతా దళాలు బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఓ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటనలో ముగ్గురు మిలిటెంట్లు హతమైనట్లు చెప్పారు.  ఘటనాస్థలం నుంచి మూడు ఏకే 47 రైఫిళ్లను, ఎనిమిది మ్యాైగ్జెన్స్‌ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు కాగా ఆప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement