మోదీ, మమత.. ప్రజాస్వామ్యానికి ముప్పు | Sonia gandhi comments on Modi and mamatha | Sakshi
Sakshi News home page

మోదీ, మమత.. ప్రజాస్వామ్యానికి ముప్పు

Apr 27 2016 1:25 AM | Updated on Oct 22 2018 9:16 PM

మోదీ, మమత.. ప్రజాస్వామ్యానికి ముప్పు - Sakshi

మోదీ, మమత.. ప్రజాస్వామ్యానికి ముప్పు

అహంకారులైన ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి ముప్పు అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు.

కానింగ్(పశ్చిమ బెంగాల్): అహంకారులైన ప్రధాని నరేంద్ర  మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి ముప్పు అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ‘జరగని వాటికి గత ప్రభుత్వాలను విమర్శించడం వారిద్దరికీ అలవాటు. వారిద్దరి అనుబంధం బెంగాల్‌కు ప్రమాదం.

మోదీ ప్రభుత్వ తీరు దేశ పునాదులకు ముప్పు వాటిల్లేలా ఉంది. ఇది లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం’ అని ఆమె మంగళవారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో మండిపడ్డారు. కాగా, మోదీ, సోనియాలు తన గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మమతా బెనర్జీ  ఎదురుదాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement