వైదొలిగిన ‘ప్రిన్సిపాల్‌ సెక్రటరీ’ మిశ్రా | principal secretary Nripendra Misra to PM, submits resignation | Sakshi
Sakshi News home page

వైదొలిగిన ‘ప్రిన్సిపాల్‌ సెక్రటరీ’ మిశ్రా

Aug 31 2019 4:12 AM | Updated on Aug 31 2019 4:12 AM

principal secretary  Nripendra Misra to PM, submits resignation - Sakshi

సిన్హాతో మిశ్రా (కుడి) (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రిన్సిపాల్‌ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్‌ తెలిపారు. పదవీ విరమణ పొందనున్న మిశ్రాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను పీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కొత్తలో మిశ్రా చాలా సహాకారం అందించారని, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేసిన ఆయనకు విరమణానంతరం అంతా మంచే జరగాలి’ అని ఆకాంక్షించారు. ప్రధానిగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన ప్రభుత్వంలో పనిచేయ డం గర్వంగా భావిస్తు న్నానని మిశ్రా తెలిపా రు.  1967 బ్యాచ్‌ ఐఏ ఎస్‌ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్‌ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్‌ సెక్రటరీ అయ్యారు. కేబినెట్‌ సెక్రటరీగా పదోన్నతి పొందిన పీకే సిన్హాకు పీఎంవోలో ఓఎస్‌డీగా  ప్రభుత్వం బాధ్యతలు కల్పించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement