‘మహమ్మారిని మట్టుపెడతాం’ | PM Modi says Violence Abuse Against Frontline Workers Is Not Acceptable | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బందిపై దాడులు సహించం : మోదీ

Jun 1 2020 12:23 PM | Updated on Jun 1 2020 1:11 PM

PM Modi says Violence Abuse Against Frontline Workers Is Not Acceptable - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దుందుడుకు వైఖరి ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వైరస్‌ కంటికి కనపడని శత్రువే అయినా కరోనా యోధులైన మన  వైద్య సిబ్బంది అజేయులని, మహమ్మారిపై వీరు తప్పక విజయం సాధిస్తారని ప్రధాని కొనియాడారు. వైద్యులు, వైద్య సిబ్బంది యూనిఫాం లేని సైనికులని ప్రశంసలు గుప్పించారు.

బెంగళూర్‌లోని రాజీవ్‌ గాంధీ హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ నేడు భారత వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల వైపు ఆశగా కృతజ్ఞతా భావంతో చూస్తున్నాయని చెప్పారు. ప్రపంచమంతా మీ నుంచి స్వస్థతను, స్వాంతనను కోరుతున్నాయని వైద్య సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.

చదవండి : కేంద్ర కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement