భగవద్గీతపై ముస్లిం బాలికకు ఫస్ట్ ప్రైజ్

భగవద్గీతపై ముస్లిం బాలికకు ఫస్ట్ ప్రైజ్ - Sakshi


ముంబయి: భగవద్గీతపై నిర్వహించిన పరీక్ష పోటీలో ముస్లిం విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచింది. 3000 మంది పాల్గొన్న ఈ పోటీలో మిగితావారందరిని వెనుకకు నెట్టి ఆ బాలిక తొలిస్థానంలో నిల్చుని బహుమతి అందుకుంది. గత జనవరిలో ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) సంస్థ 'గీతా చాంపియన్స్ లీగ్' అనే అంశంపై పరీక్ష పోటీ నిర్వహించింది. ఇందులో పలు పాఠశాలలనుంచి విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. బహులైఛ్చిక ప్రశ్నల రూపంలో ఈ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్షలో ఆరోతరగతి చదువుతున్న పన్నెండేళ్ల మర్యామ్ సిద్ధిఖీ తొలి బహుమతిని అందుకోవడం విశేషం.



ఈ సందర్భంగా మర్యామ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఖాళీగా ఉన్న సమయాల్లో మతాలకు సంబంధించిన పుస్తక పఠనం చదువుతానని, ఎప్పుడైతే ఈ కాంపిటేషన్ గురించి విన్నానో అప్పుడే భగవద్గీత గురించి తెలుసుకునే అవకాశం వస్తుందని ఆలోచించి చదవడం నేర్చుకున్నానని తెలిపింది. ఆ ప్రిపరేషనే తనకు మొదటి బహుమతి రావడానికి కారణమైందని వివరించింది. ముంబైలోని మీరా రోడ్డులోగల కాస్మోపాలిటన్ రోడ్డులో ఈ బాలిక చదువుతుంది. పరీక్షకు నెల రోజుల ముందుగా ఇస్కాన్ సంస్థ వాళ్లే సంబంధిత మెటీరియల్ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top