విచారణ సంస్థలకు సారథులే లేరు
మోదీకి రాహుల్ జపం ఎందుకు
రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఏడాది నరేంద్రమోదీ పాలనలో ధరలు నియంత్రించామంటూ పచ్చి అబద్ధాలను ప్రచారాలు చేస్తున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వయలార్ రవి, ఆర్.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి ఆయన శుక్రవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ రాసిన బహిరంగలేఖలోనూ అన్ని అబద్ధాలేనని ఆరోపించారు. ధరలు తగ్గాయనడం ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్గా ఆజాద్ అభివర్ణించారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా, ప్రజలపై భారాన్ని మోపుతూనే ఉన్నారని దుయ్యబట్టారు. ఏడాది పాలన అవినీతిరహితమని చెప్పుకోవడం ఆత్మవంచనే అని విరుచుకుపడ్డారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సమాచారహక్కు కమిషన్ వంటి కీలకమైన విచారణ సంస్థలకు సారథులే లేకుంటే అవినీతి ఎలా బయటపడుతుందని ప్రశ్నిం చారు. రాష్ట్రాలతో కలసి పనిచేస్తామంటూనే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాల్లేకుండా అణిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్గాంధీని చూసి మోదీ భయపడుతున్నారని, అందుకే మోదీ ప్రతిరోజూ రాహుల్ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వ్యవసాయంపై నిర్లక్ష్యం
వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రైతులను కష్టనష్టాల పాల్జేసిన ఘనత మాత్రం మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. భూసేకరణ బిల్లు విషయం లో దేశం అంతా వ్యతిరేకించినా మోదీ మొం డిగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలపాలన సాగుతున్నదని ఆజాద్ వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలి చిన ఎమ్మెల్యేలను దొంగల్లాగా ఎత్తుకొని పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇక్కడి అధికారపార్టీ దొంగలా వ్యవహరిస్తున్నందునే తాము పరిశీలనకు రావాల్సి వచ్చిందని ఆజాద్ వెల్లడించారు.
నేరేళ్ల శారద బాధ్యతల స్వీకరణ
పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితురాలైన నేరేళ్ల శారద శుక్రవారం గాంధీభవన్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదని, మహిళలపై వివక్షను చూపించే ప్రభుత్వంపై మహిళల హక్కుల కోసం పోరాడాల్సి ఉందన్నారు. సీఎం అతిపెద్ద మాంత్రికుడని దుయ్యబట్టారు.
'ధరలు తగ్గాయనడం ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్'
Published Sat, May 30 2015 2:33 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement