22 వరకు అభ్యంతరాల స్వీకరణ
27న జేఈఈ ఫలితాలు.. అందుబాటులో ప్రశ్నపత్రాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష కీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈ నెల 3న జరిగిన ఆఫ్లైన్, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష కీ పేపర్లను సోమవారం http://jeemain.nic.in వెబ్సైట్లో ఉంచింది. కీలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 లోగా తెలియజేయాలని సూచించింది. వాటికి సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఇందుకోసం వేర్వేరుగా లింక్లను ఇచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్వర్డ్ పొందుపరిచి కీలను పొందొచ్చని తెలిపింది. అలాగే జేఈఈ మెయిన్ పరీక్షల ప్రశ్న పత్రాలను కూడా అందుబాటులో ఉంచింది.
ఆఫ్లైన్ పరీక్షకు సంబంధించిన ఈ, ఎఫ్, జీ, హెచ్ కోడ్ ప్రశ్న పత్రాలు, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్సైట్లో ఉంచింది. ఇక ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇక ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 30న లేదా అంతకన్నా ముందే విడుదల చేస్తామని వివరించింది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 59,731 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 70 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
29 నుంచి అడ్వాన్స్డ్కు దరఖాస్తులు
ఈనెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్లో అత ్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించింది. ఐఐ టీల్లో ప్రవేశాల కోసం మే 22న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. వాటి ఫలితాలను జూన్ 12న ప్రకటించి, జూన్ 20న సీట్లు కేటాయించనుంది.
వెబ్సైట్లో జేఈఈ మెయిన్ కీ
Published Tue, Apr 19 2016 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement