మోడీ ప్రధానైతే దేశం కాలి బూడిదవుతుంది: మమతా | India will burn if Narendra Modi becomes PM: Mamata Banerjee | Sakshi
Sakshi News home page

మోడీ ప్రధానైతే దేశం కాలి బూడిదవుతుంది: మమతా

Apr 29 2014 8:29 PM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీ ప్రధానైతే దేశం కాలి బూడిదవుతుంది: మమతా - Sakshi

మోడీ ప్రధానైతే దేశం కాలి బూడిదవుతుంది: మమతా

బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు

కోల్ కతా: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. మోడీ ప్రధానైతే భారతదేశం కాలి బూడిదవుతుందని మమతా బెనర్జీ అన్నారు.  
 
అంతేకాకుండా భారత దేశ ప్రగతి ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లుతుందని మమతా వ్యాఖ్యలు చేశారు. విభజన రాజకీయాలు చేసే వ్యక్తికి దేశాన్ని పాలించే హక్కులేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రధానైపోయాననే భ్రమలో మోడీ ఉన్నారని మమతా ఎద్దేవా చేశారు. మోడీ టైగర్ కాదని ఆమె అన్నారు. 
 
దేశంలో అసలైన టైగర్లు మయావతి, జయలలిత, ములాయం సింగ్ యాదవ్ అని అన్నారు. అసలైన రాయల్ బెంగాల్ టైగర్ బెంగాల్ లోనే ఉందని మమతా అన్నారు. మత ఘర్షణల ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీకి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్ దేశాన్ని పాలించే అర్హత లేదని మమతా బెనర్జీ విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement