'గోవా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా' | Goa: Money Power has won over Peoples Power, says digviajaya singh | Sakshi
Sakshi News home page

'గోవా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా'

Mar 13 2017 9:42 AM | Updated on Mar 29 2019 9:31 PM

'గోవా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా' - Sakshi

'గోవా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా'

కాంగ్రెస్‌ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్...గోవా ప్రజలకు క్షమాపణ చెప్పారు.

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్...గోవా ప్రజలకు క్షమాపణ చెప్పారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. అధికారం, డబ్బుతో ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారని దిగ్విజయ్‌ సింగ్‌ మండిపడ్డారు. ప్రజా తీర్పు కంటే మనీ పవరే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు దిగ్విజయ్‌ ట్విట్‌ చేశారు. మరోవైపు గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రెండో స్థానం కట్టబెట్టిన బీజేపీకి గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement