త్వరలో 'భారతమాల' | East , west of the road connecting the denominator | Sakshi
Sakshi News home page

త్వరలో 'భారతమాల'

Apr 30 2015 1:33 AM | Updated on Aug 30 2018 5:49 PM

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి(గోల్డెన్ క్వాడ్రీలేటరల్) తరహాలో.. భారతదేశ తూర్పు పడమరలను కలుపుతూ ‘భారతమాల’ పేరుతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.


తూర్పు, పడమరలను కలుపుతూ రహదారి హారం

న్యూఢిల్లీ:  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి(గోల్డెన్ క్వాడ్రీలేటరల్) తరహాలో.. భారతదేశ తూర్పు పడమరలను కలుపుతూ ‘భారతమాల’ పేరుతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

ఆ వివరాలు..
మౌలిక వసతులకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చేపట్టనున్న మరో ప్రతిష్టాత్మక, భారీ కార్యక్రమం ‘భారతమాల’.
భారతదేశ తూర్పు, పడమరలను అనుసంధానిస్తూ రహదారి హారం.
అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలను కలుపుతూ గుజరాత్ నుంచి మిజోరం వరకు రోడ్డు నిర్మాణం.
రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా రహదారుల నిర్మాణం.
గుజరాత్ నుంచి ప్రారంభించి రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌ల మీదుగా మిజోరం వరకు రోడ్డు రవాణా సౌకర్యం.
ఈ రహదారికి మహారాష్ట్ర నుంచి బెంగాల్ వరకు ఉన్న తీర రాష్ట్రాల రహదారులతో, మరో ప్రతిష్టాత్మక పథకం ‘సాగరమాల’తో అనుసంధానం.
ఈ సంవత్సరం చివరలో ప్రారంభించి.. ఐదేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వం.
పర్యావరణ అనుమతులు, భూసేకరణే ప్రధాన అడ్డంకిగా భావిస్తున్న అధికారులు.
సరిహద్దు ప్రాంతాలకు, మిలటరీ అవసరాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం ఈ పథకం వ్యూహాత్మక ఉద్దేశం.
దీనితో సరిహద్దు వాణిజ్యం విస్తృతమయ్యే అవకాశం.
భారతదేశానికి వేసిన దండలా కనిపించే ఈ రోడ్డు రవాణా పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement