ముంబై: తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే ఆకస్మిక మృతిని రాజకీయం చేయొద్దని అతని కుమార్తె పంకజ ముండే విజ్ఞప్తి చేశారు. ఆమె గురువారం సింధ్ఖేడ్ రాజాలో ‘సంఘర్ష్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ యాత్ర రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 79 నియోజకవర్గాల మీదుగా సుమారు 3,000 కి.మీ. మేర సాగుతుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి గత జూన్ మూడో తేదీన ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పారు.
అయితే కొందరు తన తండ్రి మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని పరోక్షంగా తన సవతి సోదరుడైన ధనుంజయ్ ముండేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎన్సీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ధనుంజయ్ ముండే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, తన తండ్రి బతికున్నప్పుడు ఏమాత్రం సంబంధాలు లేని వ్యక్తులు, ఇప్పుడు ఆయన ఆకస్మిక మృతితో లబ్ధిపొందాలని చూస్తున్నారని పంకజ విమర్శించారు.
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ముండే సాబ్ వారసురాలిగా ప్రజలందరూ పంకజను ఆదరిస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- శివసేన కూటమి అధికారంలోకి రానుందని, అప్పుడు రైతుల ఆత్మహత్యలకు కారణమైన వారినందరినీ జైళ్లకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ యాత్రను వాస్తవానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రారంభించాల్సి ఉండగా, ఆమెకు తన రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో తన సందేశాన్ని పంపారు. అలాగే ఈ యాత్రలో పలువురు బీజేపీ అగ్రనాయకులు పాల్గొనాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని పంపజ తెలిపారు. యాత్ర ప్రారంభ కార్యక్రమంలో వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, ముండే అభిమానులు పాల్గొన్నారు.
ముండే మరణాన్ని రాజకీయం చేయొద్దు
Published Thu, Aug 28 2014 10:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement