కరోనా: కేరళలో 11, ఒడిశాలో ఒకటి | Coronavirus: 11 New Cases Reported in Kerala Today | Sakshi
Sakshi News home page

కరోనా: కేరళలో 11, ఒడిశాలో ఒకటి

Apr 22 2020 9:05 PM | Updated on Apr 22 2020 9:10 PM

Coronavirus: 11 New Cases Reported in Kerala Today - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కేరళలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.

తిరువనంతపురం: కేరళలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ 11 మందిలో ఐదుగురికి విదేశీ ప్రయాణ చరిత్ర ఉందని, ముగ్గురికి స్థానిక కాంటాక్ట్స్‌ ద్వారా కోవిడ్‌ సోకిందని వెల్లడించారు. కేరళలో ఇప్పటివరకు మొత్తం 437 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 127 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

ఒడిశాలో మరో పాజిటివ్‌..
ఒడిశాలోని జాజ్‌పూర్‌లో బుధవారం మరొకరు కోవిడ్‌-19 బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 83కి చేరింది. ఇందులో 50 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌ బారిన పడి 32 మంది కోలుకోగా, ఒకరు మృతి చెందారు. 

కాగా, దేశవ్యాప్తంగా బుధవారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 వేలు దాటగా, మృతుల సంఖ్య 652కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 5221, గుజరాత్‌లో 2272, ఢిల్లీలో 2156 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి. 

కరోనా విలయం: విదారక ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement