
పీహెచ్డీ విద్యార్థులకు 70 వేల ఫెలోషిప్
ఐఐటీ, ఐఐఎస్సీలో పీహెచ్డీలు చేసే పరిశోధకులకు నెలకు రూ. 70వేలు ఫెలోషిప్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఉన్నత విద్య సెక్రటరీ కేవల్ కుమార్ శర్మ వెల్లడించారు.
ఆర్థిక పరమైన కారణాల వల్లే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తుతున్నారని అటువంటి వారు స్వదేశంలోనే ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధకులకు ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ.70 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదం తెలపనుందని, వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఫెలోషిప్లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.