
సాక్షి, సినిమా: వెరైటీ కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉంటున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో దీపావళి శుబాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా వచ్చే ఏడాది రానున్న దీపావళికి శుబాకాంక్షలు అంటూ సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు.
‘ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్ గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ.. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.