నేనా సినిమా చేయట్లేదు..!

Pooja gandhi says i am not doing Dandupalyam 4 - Sakshi

శ్రీనివాస్‌ రాజు దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత ఆ సినిమాకు సీక్వల్‌ గా తెరకెక్కిన దండుపాళ్యం 2 ఆ స్థాయిలో విజయం సాధించకపోయినా.. చిత్రయూనిట్ మరో సీక్వల్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం దండుపాళ్యం 3 రిలీజ్‌ అవుతుండగా చిత్రయూనిట్ దండుపాళ్యం 4 పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేశారు.

ఈ పోస్టర్‌లో గత చిత్రాల్లో నటించిన వారే కనిపించారు. కానీ ఈ విషయంపై నటి పూజా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దండుపాళ్యం 4లో నటించటం లేదని తెలిపారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందగా ఎవరూ అడగలేదని. తన అనుమతి లేకుండానే తన ఫొటోనూ పోస్టర్‌లో వేశారని తెలిపారు. తనను గాని తనకు సంబంధించిన వ్యక్తులను కానీ సంప్రదించకుండా తన పేరు వాడుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top