చదివేస్తున్నారు | Nawazuddin Siddiqui joins Rajinikanth’s Thalaivar 165 | Sakshi
Sakshi News home page

చదివేస్తున్నారు

Aug 31 2018 2:01 AM | Updated on Sep 12 2019 10:40 AM

Nawazuddin Siddiqui joins Rajinikanth’s Thalaivar 165 - Sakshi

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

కైసా హై? క్యా కర్తా హై? అని హిందీ లాంగ్వేజ్‌లో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీని ప్రశ్నలు అడిగితే తమిళంలో ఆన్సర్స్‌ చెబుతున్నారు. ఎందుకంటే రజనీకాంత్‌కు దీటుగా డైలాగ్స్‌ చెప్పాలని తమిళ డైలాగ్స్‌ ప్రిపేర్‌ అవుతున్నారాయన. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష, సిమ్రాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించన్నారు. 19 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలీవుడ్‌లో ఎన్నో డిఫరెంట్‌ రోల్స్‌ చేసిన ఆయన ఈ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ‘‘నా తొలి తమిళ సినిమాకు డైలాగ్స్‌ ప్రిపేర్‌ అవుతున్నాను. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ఓ ఫొటోను షేర్‌ చేశారు సిద్ధిఖీ. ఫొటో చూస్తుంటే నవాజుద్దీన్‌ శ్రద్ధగా చదివేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement