కామెడీ.. థ్రిల్‌

mathu vadalara movie released on dec 25 - Sakshi

ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు తొలి లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ‘‘ఇటీవల రామ్‌చరణ్‌ విడుదల చేసిన మా చిత్రం టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. వినోద ప్రధానంగా సాగే మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రమిది’’  అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: పి.టి.గిరిధర్‌ రావు,  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top