‘చింటూ అంకుల్‌.. మిమ్నల్ని మిస్సవుతున్నా’ | Karisma Shares Throwback Pic Of Rishi Kapoor | Sakshi
Sakshi News home page

మీతో ఆ విషయాలు ఇక చర్చించలేను..

May 1 2020 7:11 PM | Updated on May 1 2020 8:28 PM

Karisma Shares Throwback Pic Of Rishi Kapoor - Sakshi

కపూర్‌ కుటుంబంతో రిషీ కపూర్‌

ముంబై : బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రిషీ కపూర్‌ మరణంతో కపూర్‌ కుటుంబం సహా దేశమంతా దిగ్భ్రాంతికి లోనయింది. చాకొలెట్‌ బాయ్‌తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలువురు సోషల్‌ మీడియాలో అప్పటి ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇక కరిష్మా కపూర్‌ తండ్రి రణధీర్‌ కపూర్‌ బర్త్‌డే సంర్భంగా రిషీతో కపూర్‌ కుటుంబ సభ్యులందరూ ఉన్న ఫోటోను కరిష్మా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫోటోకు ఫ్యామిలీ అనే క్యాప్షన్‌ ఇస్తూ హార్ట్‌ సింబల్‌ను జత చేశారు. అంతకుముందు తాత రాజ్‌ కపూర్‌, చిన్నాన్న రిషీ కపూర్‌తో తన చిన్ననాటి ఫోటోను కరిష్మా షేర్‌ చేశారు. ‘చింటూ అంకుల్‌ మీతో ఇక రెస్టారెంట్లు, వంటకాల గురించి డిస్కస్‌ చేయడం మిస్సవుతా’నంటూ కరిష్మా ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

చదవండి : అందుకే ఆసుపత్రిలో ‘రిషి’ని చూడలేదు: అమితాబ్‌

Advertisement
 
Advertisement
Advertisement