కుష్బూపై అనుచిత వ్యాఖ్యలు  | Gayathri Raghuram Inappropriate Comments On Kushboo | Sakshi
Sakshi News home page

కుష్బూపై అనుచిత వ్యాఖ్యలు 

May 15 2020 8:28 AM | Updated on May 15 2020 8:40 AM

Gayathri Raghuram Inappropriate Comments On Kushboo - Sakshi

చెన్నై : కుష్బూ ఒక బ్రోకర్‌ అని నటి, నృత్య దర్శకురాలు గాయత్రి రఘురామ్‌ వ్యాఖ్యానించారు. నటి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రచారకర్త కుష్బూ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తీరును అవహేళన చేశారు. దీనిపై ఆమె తన ట్విట్టర్‌లో ప్రధాన మంత్రిపై పలు ఆరోపణలు చేశారు. అందులో ప్రధానమంత్రి హిందీలో మాట్లాడారని, ఇండియాలో ప్రాచీన భాష అయిన తమిళంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కుష్బూ విమర్శలను నటి, బీజేపీ సభ్యురాలు గాయత్రి రఘురామ్‌ తిప్పికొట్టారు. ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ కుష్బూ ఒక బ్రోకర్‌ అని అన్నారు. కుష్బూ వ్యాఖ్యలను నెటిజన్లు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement