శ్రీదేవి నివాసానికి తరలివస్తున్న అభిమానులు

fans gather outside sridevi residence in mumbai - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందారు. ఆమె మృతిపై రాజకీయ ప్రముఖులు, సినీప్రముఖులు, క్రీడాప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదేవి భౌతికకాయం ఈ రోజు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో అంధేరిలోని శ్రీదేవి నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

అందాల తార శ్రీదేవి మరణంతో అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. తమ అభిమాన నటి ఇక లేరనే వార్తను ఫ్యాన్స్‌ నమ్మలేకపోతున్నారు. తమ అభిమాన తారను చివరిసారిగా  చూడాలన్న ఆత్రుతతో శ్రీదేవి  ఇంటికి అభిమానులు పోటెత్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీదేవి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాం..
దుబాయ్‌లో శ్రీదేవి కుటుంబ సభ్యులకు అన్నిరకాలుగా సహాయం అందించేందుకు వారితోపాటు, స్థానిక అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు యూఏఈలోని భారత రాయబారి నవదీప్‌ సింగ్‌ తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారని చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top