దేవి.. శ్రీ.. ప్రసాద్‌

దేవి.. శ్రీ.. ప్రసాద్‌


డీయస్పీ అంటే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ గుర్తొస్తారు. ఇప్పుడా పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మనోజ్‌ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్‌ ముఖ్య తారలుగా శ్రీ కిశోర్‌ దర్శకత్వంలో ఆర్వీ రాజు, ఆక్రోశ్‌ నిర్మించిన థ్రిల్లర్‌ ‘దేవిశ్రీ ప్రసాద్‌’. ధనరాజ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘దేవి, శ్రీ, ప్రసాద్‌... అనే ముగ్గురు యువకులు, లీలా రామచంద్రన్‌ అనే నటి చుట్టూ కథ నడుస్తుంది. ప్రతి సీన్‌ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top