Sakshi News home page

నచ్చని అమ్మాయితో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య

Published Tue, Nov 21 2017 4:46 PM

man committed to suicide in bangalore - Sakshi - Sakshi

సాక్షి, బెంగుళూరు : ఒక్కగానొక్క కొడుకు, పెళ్లి చేస్తే ఒక ఇంటివాడవుతాడని ఆ తల్లిదండ్రులు భావించారు. అందులో భాగంగా ఓ అమ్మయి ఫొటోను కొడుకు పంపించారు. అయితే అమ్మాయి నచ్చలేదని ఇంట్లో చెప్పేశాడు. అయినా ఆ అమ్మాయినే చేసుకోవాలని తల్లిదండ్రలు వత్తిడి తీసుకువస్తుండటంతో, ఇష్టం లేని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండలేనని భావించిన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహదేవపుర నియోజకవర్గం వర్తూరు పోలీసు స్టేషన్‌ పరిథిలో చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం మేరకు... మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్‌(23) బ్రతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి వర్తూరు సమీపంలోని ముళ్లూరులో నివసిస్తున్నాడు. టైల్స్‌ పనిచేసుకుంటూ, జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు ఒక అమ్మాయి ఫొటోను అజయ్‌కు పంపి.. ఆమెను పెళ్లాడాలని చెప్పారు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని తేల్చిచెప్పాడు. అయినా ఈవిషయమై తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సోమవారం రాత్రి ముళ్లూరు గ్రామ సమీపంలోని నీలగిరి తోటలో చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement