
కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ లగ్జరీ పార్కును ఏర్పాటు చేయాలని దుబాయి ప్రభుత్వం నిర్ణయించింది.
దుబాయి: కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ లగ్జరీ పార్కును ఏర్పాటు చేయాలని దుబాయి ప్రభుత్వం నిర్ణయించింది. రస్ అల్ఖైమా నగర శివార్లలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది పని చేస్తుంది. ఈ పార్కులో పెంపుడు కుక్కలకు అవసరమైన అన్ని సదుపాయాలతో వాటి యజమానులకు కూడా సౌకర్యాలు ఉంటాయి. నగరంలోని అల్జజీరా అల్ హమ్రా ప్రాంతంలో ‘పాసమ్ పార్కు’ గా పిలుచుకునే దీనిని ఏర్పాటు చేయనున్నారు. రాక్ ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏడువేల చదరపు మీటర్ల ఏరియాలో నెలకొల్పే ఈ పార్కులో పెంపుడు కుక్కలతో వాటి యజమానులకు అన్ని సౌకర్యాలు సమకూర్చనున్నామని సెంటర్ మేనేజర్ చెంజెరాయి సిగౌక్ తెలిపారు.
ఈ పార్కులో పెంపుడు శునకాలు స్వేచ్ఛగా పరుగెత్తటానికి, నడిచేందుకు దారి, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. శునకాల యజమానులు సేదతీరేందుకు కేఫ్ ఉంటుంది. కుక్కలకు బర్త్డే పార్టీలు జరిపేందుకు, పెట్ షోలు, పెట్ ట్రెయినింగ్ వంటి వాటికి తగిన వసతులున్నాయి. డాగ్ డే కేర్ సెంటర్తో పాటు కుక్కల కోసం హోటల్ కూడా ఉంటుంది. అన్ని రకాలైన, అన్ని సైజుల కుక్కలకు తగు వసతులుంటాయి. పది కిలోలు అంతకంటే తక్కువ బరువుండే కుక్కలకు, అంతకంటే పెద్ద కుక్కలకు వేర్వేరు సౌకర్యాలుంటాయని నిర్వాహకులు తెలిపారు.