కాబూల్‌లో ఆత్మహుతి దాడి.. 10 మంది మృతి | Taliban Suicide Blast In Kabul Near US Embassy | Sakshi
Sakshi News home page

కాబూల్‌లో ఆత్మహుతి దాడి.. 10 మంది మృతి

Sep 5 2019 4:00 PM | Updated on Sep 5 2019 4:02 PM

Taliban Suicide Blast In Kabul Near US Embassy - Sakshi

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం కాబూల్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో 10 మంది మృతిచెందగా, 42 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ అధికారులు ధ్రువీకరించారు. అఫ్గాన్‌ ప్రభుత్వ కార్యాలయాలు, యూఎస్‌ ఎంబసీ సమీపంలోని చెక్‌పాయింట్‌ వద్ద ఈ దాడి జరిగింది. కాబూల్‌లో అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఈ దాడి జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. భద్రత బలగాలు ఘటన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. విదేశీ బలగాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా సైన్యాలు అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు, తాలిబన్లకు, యూఎస్‌ బలగాలకు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు అఫ్గాన్‌లో ఇటువంటి దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ వారంలో తాలిబన్లు జరిపిన రెండో దాడి ఇది. సోమవారం జరిగిన ఆత్మహుతి దాడిలో 16 మంది మృతి చెందగా, 100 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement